Tuesday 21 January 2020

కంటి రోగాలకు చక్కటి పరిష్కారం "చక్షుషీ విద్యా ప్రయోగం"

కంటి రోగాలను తగ్గించుటలో చక్షుషీ విద్యా ప్రయోగం మహత్తరమైనదని ఉపనిషత్తులు పేర్కొంటున్నాయి.సంధ్యావందనము తరువాత సూర్యుని ఎదురుగా తూర్పు వైపు కూర్చుని గాయత్రి మంత్రం 24 సార్లు చదివిన తరువాత ఈ క్రింది మంత్రముతో ఒక చెంచా నీరు భూమికి సమర్పిస్తూ వినియోగించాలి.

తస్యశ్చాక్షుషీ విద్యాయా ఆహిర్భుధ్న్య ఋషి గాయత్రీ
ఛందః సూర్యో దేవతా, చక్షు రోగ నివృత్తయే వినియోగః


తరువాత క్రింది మంత్రాన్ని 12 సార్లు జపించాలి.


ఓం చక్షుః చక్షుః స్థిరో భవ ! మాం పాహి పాహి!
త్వరితం చక్షు రోగాన్ శమయ శమయ !
మమ జాత రూపం తేజో దర్శయ దర్శయ!
యధాహం అంధోనస్యాం తథా కల్పయ కల్పయ !
కళ్యాణం కురు కురు !
యాని మమ పూర్వ జన్మో పార్జితాని చక్షుః ప్రతిరోధక దుష్కృతాని సర్వాణి నిర్మూలయ నిర్మూలయ!
ఓం నమః చక్షుస్తేజో దాత్రే దివ్యాయ భాస్కరాయ !
ఓం కరుణా కరాయామృతాయ ! ఓం నమః సూర్యాయ
ఓం నమో భగవతే సూర్యాయాక్ష తేజసే నమః !
ఖేచరాయనమః ! మహాతేనమః ! రజసే నమః !
అసతో మా సద్గమయ ! తమ సోమా జ్యోతిర్గమయా !
మృత్యోర్మా అమృతంగమయ!


ఇలా 12 సార్లు చదివిన తరువాత పంచ పాత్ర లోని జలాన్ని అర్ఘ్య రూపంలో సూర్యునికి సమర్పించాలి.
1,2 చుక్కలు జలాన్ని రెండు చేతి వేళ్ళకు రాసుకుని కళ్ళు తుడుచుకోవాలి.

No comments:

Post a Comment

                         https://youtube.com/shorts/flB4WlmnbLs?si=SMNTDWimlM9c0PJd